
Harshaneeyam
Harshavardhan

1 Creator
5.0
(1)

1 Creator



5 Listeners
5.0
(1)
All episodes
Best episodes
Top 10 Harshaneeyam Episodes
Best episodes ranked by Goodpods Users most listened
03/05/23 • 57 min
5.0
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు.
ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. (https://tamil.wiki/wiki/Professor_Jesudasan) కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు. ‘కంబ రామాయణం’ విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన ఉపన్యాసాలతో అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు.
రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది.
*ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన ‘కంబ రామాయణం’ లోనివి.
‘చిలుకంబడు దధికైవడి’
“నువ్విక్కడుండి చేసేదేవుంది? బండెక్కు!” అన్నాడు కుమార్, ప్రొఫెసర్ని సభకు తీసుక రావడానికి బయలుదేరుతూ.
“అరుణ కూడా వస్తానంది! ఆమె కోసం చూస్తున్నాను” అంటూ నసిగాను.
“బావుంది.ఎదురెళ్ళి హారతి ఇస్తావా ఏంటి? భార్య, అంటే ‘ప్రేమ’ ఉండాలి కానీ ‘ఇంత’ అవసరం లేదేమో?” అంటూ వాన్ తలుపు తెరిచాడు కుమార్.
“ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు, ప్రొఫెసర్ మాంఛి ఊపులో ఉంటాడు. అపుడు ఆయన మాట్లాడుతూంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వావకాశం కోల్పోడం నాకిష్టం లేదు. చూస్తావుగా? ” అన్నాడు బండి నడుపుతూ కుమార్.
“ వాళ్ళావిడ కూడా హల్లెలూయా అనుకుంటూ పక్కనే వుంటారేమో” అన్నా నేను.
“లేదు...లేదు. ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు. వాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయంది. సరే అంబాసిడర్ లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను. ప్రొఫెసర్ తో మాట్లాడేటప్పుడు మటుకు - సంభాషణని తెలివిగా కంబ రామాయణం మీదికి మళ్ళించే బాధ్యత నీదే! మధ్యలో పొరపాటున బైబిలని కానీ ప్రభువా! అని కానీ అన్నావో... అంతా వేరే దార్లో కెళ్ళిపోతుంది.” నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్.
“ఇప్పుడు మూడేగా. సభ మొదలయ్యేది ఆరుగంటలకు కదా?” అన్నాను.
“నన్నడిగితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు.. వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఇది పొద్దునా, రాత్రా, అనే స్పృహ కొంచెం కూడా ఉండదు. ఈ పాటికే ఊళ్ళో వుండే దిక్కుమాలిన సంతంతా ఆయన చుట్టూ చేరి, పోచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్న పిల్లాడిలా వాళ్ళకు తన చెవులు అప్పగించి, వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి, లాల్చీ, పంచె తగిలించి, తీసుకవెళ్ళాల్సి ఉంటుంది.”
“స్నానం కూడా చేయించాలా?” నవ్వాను నేను.
“అలానే ఉండబోయేట్టుంది!”
కారు పున్నైవనం దగ్గర, కుడివైపుకు తిరిగింది.
”సజిన్ కి ఒక పని అంటగట్టి, నీ మీద గురి కుదరాలంటే, నువ్వీ పని పూర్తి చేయాలి! అని చెప్పి మరీ వచ్చాను.” అన్నాడు కుమార్.
“అతనికి ఈ రోజు కాలేజీ లేదా?”
“ వుంది. కానీ నాకు అసలు విషయం అకస్మాత్తుగా నిన్న రాత్రి గుర్తుకొచ్చింది. మన వల్ల అయ్యే పని కాదు! అందుకని అప్పటికప్పుడు అతనికి ఫోన్ చేసాను. పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా తయారై , మా ఇంటి దగ్గరికొచ్చేసాడు. మరీ అంత పెందరాడే వచ్చేసేటప్పటికీ, మా అక్కా వాళ్ళింటికి వేరే ఏదో చిన్న పని మీద పంపించి, అది అయింతర్వాత సభ దగ్గరికి రమ్మన్నాను. అవడానికి అరవ పంతులు అయినా, పనిమంతుడే, చూద్దాం! ఏం చేస్తాడో?”
****************
ఆయన ఇంటికి వెళ్లేసరికి మేము అనుకున్నట్టే, ప్రొఫెసర్ కేవలం పంచ మాత్రమే కట్టుకుని, నింపాదిగా వరండాలో కూచుని వున్నాడు. పాలిపోయిన తెలుపు, చిన్నపాటి ఆకారం ఆయనది. దేనికో పగలబడి నవ్వుతున్నాడు.
ఒంటిమీద చొక్కా లేకుండా, ఉన్న ఒక నల్లటి మనిషి, ఆయనకెదురుగా ఉన్న స్థంభానికి అనుకుని నిలబడి గొంతెత్తి అభినయిస్తున్నాడు, “రేయ్ ఉన్న చోటి నించీ కదలొద్దు, నీటి పాము ఉంది పక్కనే! అనంగానే, ఆ పిల్లోడు నా మాట పూర్తిగా వినకుండా వెంటనే కొబ్బరి చెట్టెక్కేసి, ‘అన్నా! అన్నా!’ అని ఆపకుండా కేకలు పెట్టాడు. రేయ్! చూస్కో, పాములు కొబ్బరి చెట్లు తేలిగ్గా ఎక్కేస్తాయి అన్నా! వాడు ‘ఏసు ప్రభువా! ఏసు ప్రభువా! అని ఆపకుండా అరిచెయ్యడం మొదలెట్టాడు.”
మేము రావడం గమనించి మాటలాపేసాడు ఆ నల్లటి మనిషి.
“కుమారూ! నువ్వేమిటి? ఇలా వచ్చావు?” అన్నాడు ప్రొఫెసర్ మమ్మల్నిద్దర్నీ చూస్తూ. “పిల్లలెలా వున్నారు? వీడు చెప్పింది విన్నావా? పాము ఈత చెట్టు ఎక్కగలదట. కల్లు కూడా తీస్తుందేమో? హ్హ హ హ్హ” నవ్వాడాయన.
“చెప్పానా! ఏవీ గుర్తు ఉండదు ఈయనకు!” నా చెవిలో గుసగుస లాడాడు కుమార్.
“ఏం సార్! బయలుదేరడానికి తయారా?” అడిగాడు కొంచెం బిగ్గరగా ఆయన్నుద్దేశించి కుమార్.
“అయ్యో! మర్చే పోయాను.” అన్నాడు హడావుడి పడుతూ ప్రొఫెసర్. “ ఈ రోజు ఆదివారం అని నాకు గుర్తే లేదు. చూడు! చర్చి కెళ్ళే రోజులు గూడా మర్చిపోయే వయసు వచ్చేసింది.”
“ఈ రోజు ఆదివారం కాదు!”అన్నాడు కుమార్ కొంచెం అసహనంగా.
“ఆదివారం కాదా!”అడిగాడు ప్రొఫెసర్ అనుమానంగా. “ఓహ్ జ్ఞానరాజ్ కూతురు పెళ్ళి కదా!” అన్నాడు ఏదో నిర్థారించుకున్నట్టు, పేలవమైన స్వరంతో.
“అది కూడా తప్పే. ఆ పెళ్ళి చైత్ర మాసంలో. ఇది మాఘ మాసం.” అన్నాడు కుమార్ కూచుంటూ.
నేను గూడా అరుగు మీద తిష్ట వేసాను. ప్రొఫెసర్ నా వైపు ప్రేమగా చూసిన చూపుతో, నన్ను ఇంకెవరో అనుకుని పొరబడ్తున్న...
03/05/23 • 57 min


2 Listeners
1 Comment
1
'ఇసుక అద్దం' శ్రీ వూహ గారితో సంభాషణ
Harshaneeyam
02/25/23 • 20 min
శ్రీ వూహ గారి మొదటి కథా సంపుటం 'ఇసుక అద్దం'డిసెంబర్ నెలలో రిలీజ్ అయ్యింది. ఈ ఎపిసోడ్ లో తన కథారచన గురించి, తనను ప్రభావితం చేసిన విషయాల గురించి శ్రీ వూహమాట్లాడారు.
ఇసుక అద్దం కొనడానికి క్రింది లింక్ ను ఉపయోగించండి.
https://bit.ly/isukaaddam
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
02/25/23 • 20 min

1 Listener
'అహింస' దాదా హయత్ గారి కథ!
Harshaneeyam
02/14/23 • 21 min
'అహింస' దాదా హయత్ గారి 'మురళి ఊదే పాపడు' అనే కథా సంపుటం లోనిది. వృత్తిరీత్యా లాయర్ ఐన దాదా హయత్ గారు కడప జిల్లా ప్రొద్దుటూరు వాసి. దాదాపుగా డెబ్బై కథలు రాసారు. ఒక స్కూలు పిల్లవాడి గురించి రాసిన ఈ కథలో సున్నితమైన మానసిక విశ్లేషణనీ, పొందికైన పదాల కూర్పునీ మనం చూడొచ్చు.
కథను హర్షణీయం ద్వారా మీకు అందించడానికి అనుమతినిచ్చిన దాదా హయత్ గారికి కృతజ్ఞతలు.
ఈ పుస్తకం కొనాలంటే, ఈ లింకుపై క్లిక్ చెయ్యండి -
http://bit.ly/2Ok88yb
అహింస:
అది మోకాలి మీదికి పాకింది. అది ఒకసారి గంభీరంగా తన స్థితి గతులు' పరీక్షించుకొని ప్రమాద మేమీ లేదన్నట్లు మళ్ళీ కదిలి ముందుకు సాగింది ఆ నల్లటి గండుచీమ.
నిద్రమత్తు కళ్ళతో దాన్నే స్తబ్దుగా చూస్తున్నాడు చంటి. అంతవరకూ ఓపిగ్గా దాన్ని గమనిస్తూ వచ్చాక దానిమీద హఠాత్తుగా ఆసక్తిపోయి విసుగుపుట్టేసి బొటనవేలికి మధ్యవేలును సంధించి లాగి ఒక్కటి తగిలించాడు. గండుచీమ ఎగిరి నేలమీదపడి సర్దుకొని నిలబడి దొరికి పోయినట్టు తికమకగా ఎటు పారిపోవాలని కాస్సేపు దిక్కులు చూసి వెనక్కి తిరిగి పలాయనం చిత్తగించింది.
ఒక మోకాలి మీద గెడ్డం ఆన్చి నిర్లక్ష్యంగా పారిపోతున్న దాన్ని గమనిస్తూ దిగుల్లో పడిపోయాడు చంటి. ఆరోజు బడికి వెళ్ళాలంటేనే నీరసం ముంచు కొచ్చేస్తోంది. ఏం చేయాలో తోచక జేబు తడుముకొని ఇన్ని బలపాలూ చాక్ పీసులూ బయటికి తీశారు. అవి ఎప్పుడూ తన జేబులో వుండాల్సిందే--రాత్రిపూట కూడా. ఎవ్వర్నీ తీయనియ్యడు.
ఓ చాక్వసుతో అరుగుమీద ఓ 'సున్నాగీసి. మధ్యలో నిలువుగా గీతగీసి చెవులు పెట్టి. పొడుగ్గా రెండు జడలు పెట్టి కింద రాశాడు. 'అమ్మ'. చంటి బళ్ళోచేరి రెండునెల్లే అయింది. కాని, అంతకు ముందే వాళ్ళమ్మ దగ్గర అక్షరాలన్నీ నేర్చేశాడు. అమ్మపక్కనే నాన్నని గీసి పీచు జుట్టు పెట్టాడు. తర్వాత గంభీరంగా తన సొంత సామర్థ్యాన్ని పరీక్షించుకొని తృప్తిగా చూసి కాస్త వెనక్కి జరిగి కింద మరోబొమ్మ గీశాడు.. 'టీచర్'.
ఈలోపల అమ్మబయటికొచ్చి కొడుకు చిత్రకళాకౌశలాన్ని తిలకించి నవ్వి, “బొమ్మలు గీస్తూ కూచున్నావా చంటీ? బడికిపోవూ? మొహం కడుక్కొని స్నానం చేద్దూగాన్రా ,” అని కొడుకుని లేవదీసింది.
మొహమ్మీది కొచ్చిన చింపిరి జుట్టుని వెనక్కి తోసుకొని, “అమ్మా, మా టీచర్ చూడవే - బావుంది కదూ?" కళ్ళు మెరిపించి వేలితో చూపిస్తూ అన్నాడు చంటి.
“ఆఁ ఆఁ చాలా బావుంది. బడికి వేళ కాదూ? రా"
చంటికి అరుగు దిగాలనిపించలేదు. బిక్కమొహం వేసుకొని దిగి అమ్మ వెంట వెళ్ళాడు.
స్నానం చేయించుకొని, తల దువ్వించుకొని అమ్మవెంట వంట గది లోనికి వెళ్ళాడు చంటి.
పొయ్యి వెలిగించి, గిన్నె పెట్టి ఉప్మాకోసం పోపువేసి తిరగ. పెడుతున్న అమ్మకొంగు లాగుతూ వగలు పోసాగాడు.
“అబ్బ, వుండరా! ఉప్మా కానీ”
అమ్మభుజం మీద గెడ్డం ఆన్చి గారంగా “అమ్మా” అని పిలిచాడు.
చీర కొంగుని గుప్పిట బలంగా బిగించి మళ్ళీ పిలిచాడు “అమ్మా”
“ఏమిట్రా?"
“ఈరోజు ....”
“ఊఁ”.
“స్కూలోద్దే".
చేస్తున్న పనాపి కొడుకు మొహంలోకి నేరుగా చూసి “ఏం?” అంది.
చంటి జవాబివ్వలేదు. అమ్మ మళ్ళీ పన్లో పడింది.
“అమ్మా”
“మీ నాన్నగార్నడుగు ”.
చంటి మొహం వేలాడేసుకొని నిల బడ్డాడు. కాస్సేపాగి మళ్ళీ కొంగు లాగాడు
“ఊఁ....”
అమ్మ చంటి చేతుల్లోంచి కొంగులాగేసింది.
చంటి ఖిన్నుడై పోయాడు. అమ్మ నిరసనకు మొహవైతే చిన్నబోయింది గాని, బడికి మాత్రం వెళ్ళాలన్లేదు.
బిక్క మొహంవేసుకొని కాస్సేపలాగే నిలబడ్డాడు. తర్వాత అమ్మ భుజం మీద చెయ్యేశాడు.
కాస్సేపూరుకొని ఒక చేత్తో భుజంమీది " కొడుకు చేతిని నొక్కి పట్టి తలతిప్పి లాలనగా చూసి “అలాగేలే, ఇంట్లో కూచుని చదువుకో” అంది.
చంటి మొహం వికసించింది. లావులావు బుగ్గల్ని నవ్వుతో మరింతలావు చేసి వంటగదిలోంచి బయటికి పరిగెత్తి నాన్నగారి ముందు “హాయ్ హాయ్” అని గెంతులేస్తుంటే పేపరు చదువుతున్న నాన్నగారు “ఏమిట్రా?” అన్నారు కొడుకుని మురిపెంగా చూస్తూ.
గెంతడం ఆ పేసి కుర్చీ కోడు పట్టుకు నిలబడి, “నాన్న అమ్మేం, స్కూలుకెళ్ళొద్దంది " అన్నాడు సిగ్గుగా. .
నాన్నగారు విస్మయంగా చూసి, “ఎందుకు?" అనడిగారు.
చంటికేం చెప్పాలో అర్ధం కాలేదు. ఆలోచన్లో పడ్డట్టు మొహం పెట్టాడు.
నాన్నగారు వంటగదిలోకి కేకేసి, “చంటిగాణ్ణి స్కూలు కెళ్లాద్దన్నావట?” అన్నారు.
“ఆఁ లోపల్నుంచి సమాధానం.
“ఎందుకూ?"
“రేపెళ్తాడులెండి"
అయోమయంతో లేచి లోనికెళ్ళారు నాన్నగారు. చంటి నేరస్తుడిలా వున్న చోటునే నిలబడ్డాడు. ఈయన స్కూలు కెళ్ళమనడుగదా? '
“ఎందుకనెళ్ళోద్దన్నావ్?” అడిగారు నాన్నగారు.
“వాడు నిన్న ఆదివారమంతా గెంతీ గెంతీ ఈ రోజు బడికెళ్ళడానికి బద్దకిస్తున్నాడు. ఎప్పుడూ ఇలా అడగలేదు. స్కూలికి పోనన్నాడు-సర్లేమ్మన్నాను.”
“అలా ఎందుకన్నావ్? చదువు దగ్గరేం గారాలు?”
“పోన్లెండీ. రేపు వెళ్తాడు. రెండు నెల్లేగా బళ్ళోచేరి.”
నాన్నగారు ముందుగదిలోని కెళ్ళిపోయి చంటివైపు చూడకుండా సీరియస్ గా పేపర్లో పడ్డారు.
చంటి అక్కడే నాన్నగారి మొహంలోకి చూసి చూసి బిడియంగా అక్కణ్ణించి కదిలి వెళ్ళిపోయి మళ్ళీ అరుగుమీద కూచోని దిగుల్లో పడ్డాడు. నాన్నగారికి క్కోపమొచ్చినట్టుంది.
ఇందాకా గీచిన బొమ్మలు చెరిపేశాడు.
ఎండవాలు కాస్త ఎక్కువయ్యే వేళకి లేచి ఇంట్లో చాపమీద కూచొని హోం వర్క్ చేస్తున్న అక్క దగ్గరకెళ్ళి “అక్కా, కేరం బోర్డాడు కుందామా?” అడిగాడు. కుతూహలంగా.
“హోంవర్క్ చేసుకొని న్కూలు కెళ్లాల్సుంటే నీతో కేరమ్సాడుకొంటూ కూచోమ్మంటావా?”
పేపర్లోంచి నాన్నగారు, “ఏం నిన్నంతా ఏంజేశావ్?” అడిగారు.
అక్క తల పైకెత్తి చూసి, “చేసుకోలేదు' ' అని నవ్వేసి మళ్ళీ చివరిలెక్క చెయ్య డంలో మునిగి పోయింది.
చంటి బాసింపట్టేసుక్కూచొని బుద్ధిగా అక్క చేస్తున్న పనివైపు చూస్తూ చదవడానికి ప్రయత్నించాడు. అసలేం అర్థంకాలేదు. విసుగుపుట్టి లేచి పెరట్లో కి వెళ్ళాడు. బంతిపూవు మీద కూచొని సీ...
02/14/23 • 21 min
02/17/23 • 46 min
1993 వ సంవత్సరంలో కేంద్ర సాహిత్య అకాడమీ బహుమతి తన కథల పుస్తకానికి గెలుచుకున్న మధురాంతకం రాజారాం గారు తెలుగులో సుప్రసిద్ధ కథారచయిత. చిత్తూరు జిల్లాకు చెందిన రాజారాం గారు మూడు వందలకు పైగా కథలు రాసారు. వారి సమగ్ర కథాసంకలనం కిందటి వారం ఎమెస్కో పబ్లిషర్స్ వారు ప్రచురించారు. ఇందులో 295 కథలు ఐదు భాగాలలో ఇవ్వడం జరిగింది. ఈ ఎపిసోడ్లో మధురాంతకం నరేంద్ర గారు వారి నాన్న గారి కథల గురించి , రచనా జీవితం గురించి మాట్లాడటం జరిగింది.
పుస్తకం కొనడానికి పల్లవి పబ్లిషర్స్ వెంకట నారాయణ గారిని 9866115655 ద్వారా వాట్సాప్ లో సంప్రదించండి.
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
02/17/23 • 46 min
'బేడమ్మ' - శ్రీరమణ గారి కథ
Harshaneeyam
02/15/23 • 7 min
'బేడమ్మ' అనే ఈ కథ శ్రీరమణ గారు రచించింది.
శ్రీరమణ గారు రాసిన శ్రీ ఛానల్ - 2 అనే సంకలనం లోనిది. పుస్తకం కొనడానికి ఇదే వెబ్ పేజీ లో ఉన్న లింక్ ని ఉపయోగించండి.
https://www.telugubooks.in/products/sri-channel-2
బేడమ్మ ఆవిడ అసలు పేరేమిటో తెలియదు. పుట్టు పూర్వోత్తరాలూ తెలియవు. ఎవర్ని అడిగినా “మాకు గ్రాహ్యం వచ్చినప్పట్నించీ బేడమ్మ యిలాగే వుంది. గోగుకాడలా” అంటారు తప్ప వయసు చెప్పలేరు.
ఒంగిపోకపోయినా నిలువెల్లా వార్థక్యం తెలుస్తూనే ఉండేది.
బ్రాహ్మణ వీధిలో ఉన్న పది యిళ్లూ తనవే అనుకునేది బేడమ్మ. రోజుకో ఇంట్లో భోజనం చేసేది. అదీ ఒక్కపూట ! ఆ రోజు ఆ ఇంటెడు చాకిరీ తనే చేసేది “అప్పనంగా తింటే అరగదు నాయనా' అనేది.
ప్రతిరోజూ గుడిబావి నించి పది ఇళ్లకీ మడినీళ్లు మోసేది.
బ్రాహ్మణ వీధికీ, శివాలయానికి పది గడపల దూరం. తెలతెలవారకుండానే ఆలయానికి వెళ్లి, గుడిముందు కసువూడ్చి, బిందెడు నీళ్లు జల్లి ముగ్గువేసేది. తను తలారా నీళ్లు పోసుకుని, ఆనక గుడిబయట నందిబొమ్మని కడిగి, నిక్కపొడుచుకున్న నందిచెవుల మధ్య కాసిని పూలు పోసి, మూసి వున్న తలుపుల్లోంచి చంద్రశేఖర స్వామికి దణ్ణం పెట్టుకునేది బేడమ్మ.
కళ్లాపు జల్లులకు ధ్వజస్తంభం మీది చిలకలూ పిచ్చుకలూ నిదురలేచి మేతలకు బయలుదేరేవి. ఆ అలికిడికి ధ్వజస్తంభపు చిరుగంటలు వులిక్కిపడేవి. రాలిన జువ్వి పూరేకుల్ని చూసి బియ్యపు గింజలనుకుని పిట్టలు ఆశగా చెట్టుకింద వాలేవి, నిద్రమొహాలతో.
కాదని తెలిసి టపటపా రెక్కలు కొట్టుకుంటూ గుంపుగా ఎగిరిపోయేవి. ఈ లోగా బేడమ్మ బిందె నిండా నీళ్లు చేదుకుని - ఓ మందారం. నాలుగు నందివర్ధనాలు, గుప్పెడు పారిజాతాలు, పుంజీడు పచ్చ గన్నేరులు బిందెలో వేసుకునేది. తళ తళలాడే నీళ్ల బిందె నడుముకి మోపి బేడమ్మ రోడ్డు వారగా వెళ్తుంటే పూలకలశం కదిలి వెళ్తున్నట్టుండేది.\
ఆ పసిపొద్దు కిరణాలలో బిందెలోపూలు నీళ్లకుదుపులకి లయలూ హొయలూ వొలికించేవి. ఆ లేత వెలుగులకి సువాసనలు అద్దేవి.
అలా మొదలైన నీళ్లమోత సాగి సాగి, బేడమ్మ తలమీంచి కొసలనించి జారిన నీటిచుక్కలతో రోడ్డు వారగా పడిన నీళ్ల చార వీధికి అంచుదిద్దినట్టు అయ్యేది. పూర్తిగా తెల్లారేసరికి బ్రాహ్మణవీధి గడప గడపనీ శివాలయంతో తడిపోగులతో ముడివేసేది బేడమ్మ.
ఆ వీధిలో ఏ కాస్త సందడి వచ్చినా బేడమ్మ సాయం కోరేవారు. అప్పడాలు, వడియాలు, ఊరగాయలూ లాంటి పై పనులు వచ్చినా, నోములూ, వ్రతాలు, చుట్టాలూ, తద్దినాలూ ఏమొచ్చినా బేడమ్మ రంగంలోకి దిగేది. రూపాయి అర్థా ఇస్తే పుచ్చుకునేది. ఏరోజు ఎక్కడ పెద్దతోడు కావాలంటే అక్కడా రోజు మకాం. పుట్టెడు అమాయకత్వం తప్ప పేచీ లేని మనిషి.
ఓసారి దసరా ఉత్సవాలకి బెజవాడ కనకదుర్గమ్మని చూడ్డానికి వెళుతూ ఎవరో బేడమ్మని కూడా తీసికెళ్లారు. ఊరి పొలిమేర దాటడం, బస్తీ చూడడం బేడమ్మకి అదే మొదటిసారి. వచ్చాక అక్కడి వింతలూ, విశేషాలూ అనేకం చెప్పింది. “అక్కడ బారెడు, బారెడు అరటిదూటలకి వెలట్రీ తగిలించి వెలిగించారు నాయనా, అది వెలుగంటే వెలుగు కాదు... వెన్నెల..” అని ట్యూబులైట్లని గురించి చెబితే అందరూ నవ్వుకుని మళ్లీ మళ్లీ చెప్పించుకునేవారు.
ఆడైనా, మగైనా, పిల్లయినా, పెద్దయినా, పక్షయినా, జంతువైనా 'నాయనా' అని సంబోధించడం బేడమ్మ సొంత ముద్ర.
పేచీ పూచీ లేని బేడమ్మకి వేరే దిగులూ విచారమూ లేవు గానీ ఒకే ఒక్క భయం ఆవిడని వేధించేది పాపం. తను చచ్చిపోతే కట్టెల్లో వేసి కాల్చేస్తారని ఆవిడకి చచ్చేంత భయం....
చిన్నా, పెద్దా ఎవరు పలకరించినా “ నన్ను కాల్చకండి నాయనా... నొప్పి పుడుతుంది... భరించలేను నాయనా” అని బతిమాలుకునేది. చీరకొంగున బేడకాసు తీసి లంచంగా ఇచ్చి ఒట్టు వేయించుకునేది. కొందరు అకతాయిలు బెల్లించి, బెదిరించి బెడలు పట్టేసేవారు. మా ఊళ్లో బేడమ్మ చేతికింద చెయ్యి పెట్టని వాళ్లు లేరు. బేడలు పుచ్చుకొని వారు లేరు.
ఆవిడ కష్టం కొద్దీ అక్షయంగా బేడలు కొంగు ముడికి జమకడుతూనే ఉండేవి.
ఓసారి కరణం గారింటికి జమా బందీకి తహసీల్దారు గారొస్తే బేడమ్మ కమ్మగా వంట చేసి పెట్టింది. వంటనీ... వడ్డననీ ఆయన మెచ్చుకోగా చూసి, చొరవ చేసి బేడమ్మ తన సమస్యని చెప్పి
“నాయనా హోదాగలవాడివి. వస్తే నువ్వే చూసుకోవాలి. ఆ బాధ నేను భరించలేను నాయనా!” అని కన్నీళ్ళొత్తుకుంటూ తాంబూలంలో బేడ కాసు పెట్టి ఇచ్చింది. తాసీల్దారు బేడ లంచానికి అదిరిపడ్డారు.
బేడమ్మ అమాయకత్వాన్ని అర్థం చేసుకొని ఆ బేడని కళ్లకి అద్దుకున్నాడు. ఆ విధంగా బేడమ్మ పేరు అనాదిగా స్థిరపడిపోయింది.
రోజూ, చివరి బిందెకి - గడకర్రతో మారేడు దళాలు రాల్చి, వాటి మీద దేవుడి వాటా పూలు ముఖద్వారపు రాతిపద్మం మీద కుప్ప పోసేది. ఆ పూలరెక్కల కింద బేడకాసు కప్పెట్టే సంగతి పెట్టినమ్మకి తెలుసు. పూజారికి తెలుసు. లోపలున్న మూడోకంటి వాడికి తెలుసు.
కృష్ణా పుష్కరాలకి బళ్లు కట్టుకుని ఊరు ఊరంతా కదిలినట్టు కదిలింది శ్రీకాకుళం రేవుకి. బేడమ్మ సంబరం అంతా యింతా కాదు. మజిలీ మజిలీకి బండి మారుతూ మధ్య మధ్య గుట్టు చప్పుడుగా బేడలు పంచుతూ బతిమాలుతూ బామాలుతూ ఊరికీ రేవుకీ దూరాన్ని తగ్గించింది.
పుష్కరాల రేవు మహా పర్వడిగా ఉంది. రేవులో దిగి కొంగుముడి విప్పి బేడకాసు కృష్ణమ్మ ఒడిలోకి విసిరి "నాయనా నీదే పూచీ... ఆ బాధ తట్టుకోలేను. నాయనా” అని దణ్ణం పెట్టుకుంది.
ముక్కు మూసుకు మూడుసార్లు మునిగి లేచింది కానీ నాలుగోసారి బేడమ్మ లేవలేదు. ఊరి వారు, రేవు వారు గాలించారు. బేడమ్మ జాడలేదు.
" నాయనా నన్ను... నొప్పి భరించలేను..” అని బేడమ్మ పంచిన ప్రతి బేడా ఎలుగెత్తి ఘోషించినట్టనిపించింది మా ఊరి జనానికి. కృష్ణమ్మ ఒడిలో బేడమ్మ విసిరిందే ఆఖరిబేడ. తర్వాత “నయాపైసలు” చలామణీలోకి వచ్చాయి. బేడమ్మ లేని పుష్కరాల బళ్లు ఊరు చేరాయి.
ఊరికీ శివాలయానికి ఉన్న తడిముడి ఆనాటితో తెగిపోయింది.
‘హర్షణీయం’ పాడ్కాస్ట్ ని ‘గానా’ (Ganaa) అప్ ద్వారా వినాలంటే –
02/15/23 • 7 min

1 Listener
తిలక్ గారి 'దేవుణ్ణి చూసిన మనిషి'
Harshaneeyam
02/14/23 • 42 min
తెలుగు వచనా కవిత్వాన్ని తన అద్భుతమైన ప్రతిభతో ఉన్నత శిఖరాలకు తీసుకువెళ్లిన కవి, శ్రీ దేవరకొండ బాలగంగాధర తిలక్. అతి చిన్న వయసులో , యాభై సంవత్సరాలు కూడా నిండకుండా అయన మరణించడం తెలుగు వారి దురదృష్టం.
తిలక్ గారి మరణానంతరం 1968లో ముద్రణ పొందిన తిలక్ కవితల సంపుటి ' అమృతం కురిసిన రాత్రి ' ఉత్తమ కవితాసంపుటిగా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు 1971 లో పొందింది.
ఇదిగాక ఆయన కొన్ని అద్భుతమైన కథలను రచించారు.
ఇప్పుడు వినబోయే కథ 'దేవుణ్ణి చూసిన మనిషి' - 'తిలక్ కథలు' అనే సంకలనం నుంచి. ఈ పుస్తకాన్ని నవచేతన వారు పబ్లిష్ చెయ్యడం జరిగింది.
తిలక్ గారి కథలు ఆడియో రూపంలో మీకందించటానికి అనుమతినిచ్చిన శ్రీ మధుకర్ గారికి, హర్షణీయం తరఫున హృదయ పూర్వక కృతజ్ఞతలు.
ఈ పుస్తకం మీరు కోనేటందుకు కావలసిన వివరాలు , ఇదే వెబ్ పేజీ లో ఇవ్వటం జరిగింది.
కథ:
గవరయ్య పెళ్ళాం లేచిపోయిందన్న వార్త ఊరు ఊరంతా ఉత్సాహంగా వ్యాపించింది. అంతకుముందు రోజునే చైనా ఇండియా సరిహద్దులలో దురాక్రమణ చేసిందనీ, యుద్ధం జరుగుతూన్నదనీ వచ్చిన వార్త చటుక్కున అప్రధానమైపోయి అందరూ మరచిపోయారు కూడా. ఆడది లేచిపోవడంలోని విశిష్టతని ఈ వూరువారొక్కరే గుర్తించారా అనిపిస్తుంది. యింత తెలుగు దేశంలోనూ!
రోడ్ల కూడలిలో, కాఫీ హోటలులో (ఆవూళ్ళో ఒకటే వుంది) పొలంగట్లనీ, పంచాయితీ బిల్డింగ్ దగ్గరా పురుషులూ; పెరటి గోడల దగ్గరా, బావులూ, నీలాటి రేవుల దగ్గరా ఆడవాళ్ళూ ఈ విషయాన్నే చిత్ర విచిత్రంగా చెప్పుకుంటున్నారు. వట్టి లేచిపోవడమే అయితే యింత సంచలనం కలిగించకపోను; అందులోనూ ఎందుకూ పనికిరాని ఎదురింటి అరుగుమీది మిషన్ కుట్టుపనివాడితో లేచిపోవడమే మరీ విడ్డూరంగా వుంది. ఇంతకన్న మరో ఏ పెద్దమనిషితో లేచిపోయినా యింత అప్రదిష్ట ఉండకపోనని వూళ్ళో అనుభవజ్ఞులైన పెద్దలు అనుకున్నారు. చాలామంది యువకులు గవరయ్య భార్య తమని నిష్కారణంగా అవమానించినట్టూ అన్యాయం చేసినట్టూ బాధపడ్డారు.
“వాడిలో ఏం చూసి లేచిపోయిందత్తా” అని మూడోసారి అడిగింది తన అత్తని ఒక పడుచు తన కుతూహలం ఆపుకోలేక.
“పోనీ నువ్వే వాడితో లేచి పోకపోయావూ నీకు తెలిసొచ్చును” అంది అత్తగారు విసుగుతో, కోపంతో.
“గవరయ్యకి బాగా శాస్త్రి అయింది” అని ఏకగ్రీవంగా ఆబాల గోపాలమూ తీర్మానించారు.
గవరయ్యను చూసి జాలిపడినవాడూ సానుభూతి తెలిపినవాడూ ఒక్కడు లేడు.
గవరయ్య అంటే ఆ వూళ్ళో అందరికీ అసహ్యం. మనిషి కూడా నల్లగా ఎగుడుదిగుడుగా వుంటాడు. మొహంమీద స్ఫోటకం మచ్చలు, పెదాలు లావుగా
మోటుగా వుంటాయి. కనుబొమ్మలు గుబురుగా గొంగళీ పురుగులు అతికించినట్లు వుంటాయి. ఊరికి శివారున వున్న పెద్ద పెంకుటింటి లోగిలిలో గవరయ్య వుంటాడు.
“నాకు తెలుసును ఇలాంటిదేదో జరుగుతుందని” అన్నాడు కన్నులరమూసి అవధాని. అవధాని ఆ వూళ్ళో ధర్మకర్త.
మునసబు చలపతి, కరణం నరసింహమూ తల వూపారు. దాంతో మరికాస్త ఉత్సాహంతో ఉపనిషద్వాక్యంలాంటి పై వాక్యానికీ వ్యాఖ్యానం చెప్పాడు ధర్మకర్త.
“వేణుగోపాలస్వామి వూరికే పోనిస్తాడా? ప్రథమ కళత్రం చావనే చచ్చింది. ఇంక ఈ రెండో ఆవిడ చావుకన్న ఘోరమైన పని చేసి వూరుకుంది. ఒక్క ధర్మకార్యం చేశాడా? ఒక్క మంచిమాట చెవిని పెట్టాడా?”
మున్సబు చలపతి చేతికర్రను నేలమీద తాటించి అన్నాడు “ఒక్కరిని దగ్గరకు రానిచ్చాడా? కర్కోటకుడండీ యీ గురవయ్య. ఎంత అహం, ఎంత పొగరు....”
“పాపపు సొమ్మండీ పాపిష్టి ఆర్జితం! దాని ఫలితం వూరికే పోతుందా? మొన్న కుర్రాళ్ళందరూ వెళ్ళి భజన చందాకి ఒక్క రూపాయి _ ఒబ్బు రూపాయి యిమ్మంటే తరిమి కొట్టాడుట...” అన్నాడు కరణం.
గవరయ్య యిరవై ఏళ్ళ క్రితం ఇరవై ఏళ్ళవాడు ఈ వూరొచ్చాడు. ఈ వూళ్ళో అతనికో మేనత్త వుంది. తల్లీ తండ్రి లేని అతను యీ మేనత్త దగ్గరకు వచ్చిపడ్డాడు. వస్తూనే కొంత డబ్బుకూడా తీసుకుని వచ్చాడు. ఈ వూరికి రెండు మైళ్ళ దూరంలోనే టౌను వుంది. రోజూ ఉదయమే టౌన్ కి వెళ్ళి చీకటి పడ్డాక తిరిగొచ్చేవాడు. కొన్నాళ్ళకి తోళ్ళ వ్యాపారం చేస్తున్నాడని తెలిసి అందరూ “హరీ హరీ” అని చెవులు మూసుకున్నారు. మేనత్తతో యిది చాలా పాపమనీ బెడిసికొడుతూందని చెప్పారు. కానీ మేనత్త ఏమీ మాట్లాడలేదు. కొందరు చొరవచేసి గవరయ్యతో జంతు చర్మ విక్రయం మంచిది కాదని చెప్పారు.
“జంతువులేం ఖర్మ మనుషుల తోలునే అమ్ముతాను. మరీ పల్చన కాబట్టి పనికి రాదు కాని” అని సమాధానమిచ్చాడట గవరయ్య.
గవరయ్య ఒంటెత్తుమనిషి. ఎవరితోనూ మాట్లాడడు, కలవడు. అసలు గవరయ్య నవ్వడం ఎవరూ చూడలేదు. అదేకాక గవరయ్యకి “పాపం” 'పుణ్యం” అని భేదాలు వున్నట్టు కూడా తెలియదు.
ఈ యిరవై ఏళ్ళలోనూ అతను లక్ష రూపాయలకి పైగా సంపాదించాడని ప్రతీతి. ఊళ్ళో పెద్దలు - ఉదారులూ ధర్మపరులూ కాబట్టి, అతని పాప వ్యాపారాన్ని క్షమించి అతని శ్రేయస్సు కోరి అతని ఆముష్మిక సుఖం కోసం దానధర్మాలు చేయమనీ, గుడి మండపం కట్టించమనీ, పాఠశాల బిల్డింగ్ కి చందా యిమ్మనమనీ, సప్తాహాలు చేయించమనీ చెవిలో యిల్లు కట్టుకుని చెప్పారు.
గవరయ్య గుండ్రంగా లోతుగా వున్న కళ్ళని కుంచించి మోటైన పెదాలమధ్య చుట్టని నొక్కి పెట్టి, విసుగ్గా, విసురుగా “నేనొక్క కానీ యివ్వను, పోయి మీ అబ్బతో చెప్పుకోండి” అనేవాడు. మంచి లేదు, మర్యాదా లేదు వీడికి అనుకున్నారు వాళ్ళందరూ పరోక్షంగా. అతనికి లక్ష రూపాయలుండడంవల్ల అతని ఎదురుగా అలా అనలేదు. వాళ్ళు సహజంగా జ్ఞానులు కాబట్టి.
గవరయ్య మేనత్తగారింటికి చేరిన కొద్ది రోజులలోనే ...
02/14/23 • 42 min
02/18/23 • 34 min
సత్యలింగం’ పతంజలి శాస్త్రి గారు రాసిన ‘గుప్తా’91’ సంపుటం లోనిది. పుస్తకం కొనడానికి కింద ఇచ్చిన లింక్ వాడొచ్చు. గత సంవత్సరం చదివిన నేను చదివిన కథల్లో నిస్సందేహంగా సత్యలింగం అత్యుత్తమైన కథ.
కథలోకెడితే 'టీటీ' అని పిలవబడే రైల్వే టికెట్ కలెక్టర్ కాంతారావు స్నేహితుడు స్వామి. తన ఇంట్లో అద్దెకుండే కూర్మయ్య నాయుడి గురించి స్వామికి చెప్పుకుంటూ ఉంటాడు కాంతారావు. నాయుడు విపరీతమైన కోపిష్టి. ఒళ్ళూపైతెలీని కోపంతో ఇబ్బందుల్లో ఇరుక్కుంటూ ఉంటాడు. తన జీవితంలో ప్రశాంతత నెలకొనేటందుకు, కాంతారావును సలహా అడుగుతాడు నాయుడు. రైల్లో ఎక్కడో చూచాయగా విన్న విషయాన్ని ఆధారంగా చేసుకుని, నాయుడి మనసులో సత్యలింగాన్ని ప్రతిష్టిస్తాడు కాంతారావు. సత్యలింగం వల్ల కూర్మయ్య నాయుడు జీవితంలో ఏవి జరిగింది, అనేదే కథ. కూర్మయ్య నాయుడు ఎంత ఆసక్తికరమైన పాత్రో అంతకంటే కాంతారావు అంతర్మధనం , కూర్మయ్య నాయుడి పై అతనికి తెలీకుండా ఏర్పడే సానుభూతి, కాంతారావుని పాఠకుడి మనసుకి చాలా దగ్గరగా చేరుస్తాయి.
కథ చివరికి వచ్చేటప్పటికి నమ్మకం, విశ్వాసం, ఆధ్యాత్మికత మనిషి కి ఇచ్చే ఆసరా, వీటన్నిటీ గురించి పాఠకుణ్ణి లోతుగా ఆలోచింపచేస్తుంది ‘సత్యలింగం’.
గుప్తా'91 పుస్తకం కొనడానికి -
http://bit.ly/3lGsrqd
This podcast uses the following third-party services for analysis:
Podtrac - https://analytics.podtrac.com/privacy-policy-gdrp
Chartable - https://chartable.com/privacy
02/18/23 • 34 min
02/13/23 • 23 min
'సొట్ట ఆదిగాడు' అనే ఈ కథ, వంశీ గారి "మా దిగువ గోదారి కథలు' అనే కధాసంపుటి నించి.
పుస్తకం కొనడానికి - https://www.telugubooks.in/products/vamsi-ma-diguva-godari-kathalu?_pos=4&_sid=1941d5909&_ss=r (ఈ లింక్ ని ఉపయోగించండి.)
'సొట్ట ఆదిగాడు':
ఆ వూళ్ళో వున్న అరవై ఎకరాల తోటలూ, వూరికి ఎదురుగా వున్న గోదావరి మధ్యలో వున్న వంద ఎకరాల లంకలు రావి కంపాడు రాజులవి.
ఆ రాజుల తాలూకు గుమాస్తాలే వూళ్ళో వుండి కూలోళ్ళనీ పాలేళ్ళనీ పెట్టి పంటలు పండిస్తున్నారు. అదీ ఈనాటి నించి కాదు ఏనాటి నించో.
అయితే, దొంగలుగానీ, దోచుకుపోయేవాళ్ళుగానీ ఆ ప్రాంతాలకి రాకండా కూలోళ్ళు పాలేళ్ళూ ఉద్దారకుడూ పగటిపూట కాపలాగాస్తే రాత్రిపూట గంగాలమ్మ తల్లి కాపలా కాస్తుంది.
గంగాలమ్మంటే మామూలు మనిషి కాదు. గ్రామదేవత. మహాశక్తి, ఆది శక్తి. ఆవిడకి విగ్రహం లేదు. తోటలో ఒక పంపర పనాస చెట్టు మొదట్లో బొట్టెట్టి గుగ్గిలం పొగేసి అగరొత్తులు వెలిగించి నైవేద్యాలు పెట్టుకుని దణ్ణాలు పెట్టుకుంటారు.
ఆమధ్య మాదిగ పేటలో కాళిదాసు సూరన్నగాడు తోటలో కాసే కాబూలు దానిమ్మకాయలు కోసుకెళ్లామని రాత్రిపూట వస్తే తెల్లారేసరికి ఆవిడ పాదాల దగ్గర (పంపరపనస చెట్టు మొదట్లో) రక్తం కక్కుకు చచ్చిపడున్నాడు.
ఇంకోసారి లంకలో పొగాకు మోపులు పట్టుకెళ్లామని నావఁ వేసుకెళ్తే, తెల్లవారేసరికి వాళ్ల తలకాయలు పొగాకు తోటలోనూ, మొండాలు ఎక్కడో వున్న మూలస్థానం అగ్రహారం రేవులోనూ తేలాయి.
పరిశోధనంటా దిగిన పోలీసులకి చంపినోళ్ళెవరన్నదిఎన్నాళ్ళకి తేలలేదు.
అయినా సరే డిటెక్షను చేస్తున్న పోలీసుల్ని చూసి, నవ్వుకున్న గోపిలంక జనం, “వెర్రిగాకపోతే ...అమ్మోరు. వీళ్ళకి దొరుకుద్దా?” అనుకున్నారు.
అమ్మోరు గంగాలమ్మ తల్లంటే రావికంపాడు రాజులకి చాలా నమ్మకం, చాలా భయం భక్తీనీ,
ఆ తల్లిని నమ్మేవాళ్ళు ముక్కనుమ రోజున కోడిపుంజుల్నీ బోల్డన్ని మేకపోతుల్ని గొర్రెపోతుల్ని బలేస్తారు. ఆ రోజంతా ఆవిడ ముందు రక్తం గట్టు తెగిన ఏరులా పారుతూ వుంటుంది. నెర్రలు తీసిన నల్లరేగడి నేలలో ఇంకుతా వుంటుంది. అమ్మవారికి తుని నించి కొమ్ము బూరా వాళ్లని, పెద్దాపురం నించి డప్పులవాళ్లని పిలిపించి మా గొప్పగా చేయిస్తారు సంబరం. చిత్రమేంటంటే ఎప్పుడూ గుమాస్తాలకి వదిలేసే ఆ రాజులో ఒకరు మాత్రం ఆ సంబరం రోజు వచ్చి తీరతారు. అది ఆనవాయితీ..
ఎడం కాలు మడం దగ్గర తోడెయ్యడంతో వేళ్ళని మాత్రం భూమ్మీద ఆన్చి నడిచే గుత్తాల ఆదియ్యని సొట్టాదిగాడంటారంతా. చాలా కష్టపడి పనిచేసే ఆ సొట్టాదిగాడి నోరు మంచిది కాదంటారు.
అలాంటి సొట్టాదిగాడు రావికంపాడు రాజుల కమతంలో జేరాడు.
ప్రతి ఏడు వారి వంశంలో ఎవరో ఒకరొచ్చేవారు. అలాంటిది ఆ ఏడు ముక్కనుమ రోజు ఆ రావి కంపాడు రాజులు ముగ్గురొస్తున్నారు.
గోపిలంక గంగాలమ్మ వారి సంబరం చరిత్రలోనే, ఇదో గొప్ప వింతని గుమస్తాలంతా తెగ కంగారు పడిపోతా, సంబరం చాలా పెద్ద ఎత్తున జరిపించే పనుల్లో వున్నారు.
రకరకాల బెత్తాయింపులు, రకరకాల ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తూర్పు నుండే తోటల మధ్య పడమట వేపుండే గోదావరితల్లి కనపడేలా కొబ్బరితోటల మధ్యలో అచ్చం రాజులకోటలా కట్టిన గెస్టహౌస్లోకి దిగిన రాజులు, పాలేళ్ళందరికి తలకో జత బట్టలూ నూట పదహారు! చొప్పున డబ్బులు ఇమ్మని గుమస్తాలకి ఆర్డర్లేశారు.
ఎక్కడ దొరికిందో మూడు ముంతల సందకల్లు దొరికింది సొట్టాదిగాడికి. దాన్ని లాగిస్తుండగా రాజులు తోటలోకి దిగారన్న సంగతి తెల్సింది. నిషా బాగా ఎక్కేసిన ఆదిగాడికి రాజులో మాటాడాలనిపించింది
సొట్టాది గాడు అనుకుంటున్నట్లు అక్కడెవరికైనా తెలిస్తే కాళ్ళకి పలుపుతాడు మెలేసి పక్కకి లాగేసే వారు. కానీ, ఎవరి పనుల్లో వాళ్లుండటంతో ఈడ్ని పట్టించుకోలేదు.
గెస్ట్ హౌస్ బాల్కనీలో కూర్చున్న రావికంపాడు రాజులకి ఈ తోటల్లో మా గొప్పగా దర్శనమిచ్చే ఆ గోదావరి తల్లి, ఈ వాతావరణం ఇంత గొప్పగా వుంటుందని ఇప్పుడే తెలిసొచ్చింది. వాళ్లు కళ్ళు మూసుకుని గంగమ్మ తల్లికి దణ్ణమెట్టుకుని ఇక నించి ప్రతి ఏడూ వస్తామని మొక్కుకున్నాకా స్కాచ్ పోసిన గ్లాసులందుకున్నారు.
ఇంతలో దిగిపోయిన సొట్టాదిగాడు, “మా రాజులకి నమస్కారవండి," అన్నాడు.
మందు పుచ్చుకుంటా ఎవర్నువ్వన్నట్టు చూశారు.
“నన్ను సొట్టాదిగాడంటారు బాబూ..." అంటా ఆ రాజుగారి నోట్లో వున్న దాన్ని చూసి, "తవరి నోట్లో అదేంటండి తెల్లగా అంత పొడుగ్గా వుంది," అన్నాడు.
నవ్వేసిన రంగరాజు, "ఇదా? దీన్ని కింగ్ సిగరెట్ అంటార్లే... సిగరెట్ కోసమొచ్చావా?" అనందిస్తుంటే సిగ్గుపడతా తలొంచుకుని, “వద్దండి బాబూ నా దగ్గర గుర్రంబీడి వుందండి." అన్నాడాదిగాడు.
"అయితే సరే," అనుకుంటా సిగరెట్లు వెలిగించి స్కాచ్ తాగుతున్నారు.
వాళ్ళ ముందు చతికిలబడిపోయిన సొట్టాదిగాడు, “ఎంత కింగయినా గుర్రం లేకపోతే వేస్ట్ కదండీ,” అనడంతో గతుక్కుమన్న రంగరాజు, "ఈడికి బాగా ఎక్కేసినట్టుంది.” అన్నాడు.
"స్కాచ్ పక్కన నీచు కాదండి... కొంకిడికాయ రసం కలిపిన సందకల్లు తాగండి. అసలు కిక్కేంటో తెలుస్తది." అన్నాడు సొట్టాదిగాడు.
మూడో రౌండు పోసుకుంటున్న పర్వతాలరాజుగారు, “ఏరా.... పండగపూట ఒంటిమీద బట్టలు చేతిలో డబ్బులూ పడేసరికి మాట తేడా వచ్చేసింది,” అన్నారు.
నవ్వేసిన సొట్టాది, "మావి మాటలే బాబూ... సేతలు మాత్రం మీవి.." అంటా లేచి, “ఏవండి... జత బట్టలు జీవితమంతా సరిపోతాయా... నూట పదార్లుతో నేను సచ్చిదాకా కల్లు తాగల్నా" అనడంతో చిరాకు పడతా లేచిన పర్వతాలరాజు, “మరి మీలాంటి కూలి నాకొడుకులకి మా భూములు బంగ్లాలూ రాసెయ్య మంటావా?" అన్నాడు.
"నిజంగా కూలోడు మీ కొడుకైతే తెలుస్తదండీ కష్టమేంటో."
సొట్టాదిగాడి నడ్డి మీద తన్నడానికి లేచిన రంగరాజుని కూర్చోబెట్టారు బంగార్రాజుగారు. అయినా కోపం ఆగని రంగరాజు, “ఏంట్రా నోరు లెగుస్తుంది," అన్నాడు.
“కూలోడు గోదారితల్లిలాంటోడండి... ఆడెప్పుడు గోపాదాలరేవులో గోదారమ్మలాగ మెదలకండానే వుంటాడండి... సిరాకేస్తేనే ఇదిగో ఇప్పుడు నాలాగ రెచ్చిపోతాడండి," అన్నాడు సొట్టాదిగాడు.
"అసలు వీడ్నిక్కడికెవడు రానిచ్చేడు," అంటా చిరాగ్గ...
02/13/23 • 23 min
02/13/23 • 11 min
“ తెరిచిన గుడిలాంటిది హాస్పటల్. బిహేవ్ లైక్ ఎ డివోటెడ్ ప్రీస్ట్”
ఏమి జోక్ వేశారు సార్! కలకాలం గుర్తుంచుకోవాల్సిన జోక్. పగిలిన సిరంలు, మొద్దుబారిన నీడిల్సూ, ఎక్స్పయిరీ డేటు అయిపోయి 'మృత్యువు నోట్లో పాలపీకలం' అన్నట్లుగా చూస్తున్న స్క్రిప్టో పెన్సి లిన్లూ, నైవేద్యపు చీరపై మెన్సెస్ మరకలా ఫంగస్ పట్టిన సెలైన్ బాటిల్సు- ఇది సార్ హాస్పటల్ అంటే. తుప్పు పట్టిన మంచాలూ, అన్ని రకాల బాక్టీరియాలకూ, వైరస్లకూ ఆహ్వానం పిలికే ముసలి వేశ్యల్లాంటి బెడ్లు, వాటి పై భగవంతుని కర్మాగారంలో పనికిరాక పారవేసిన యంత్రాల్లాంటి పేషెంట్లు.
“పేషెంట్ ఈజ్ ది రియల్ టీచర్! అతన్ని గౌరవించు. ప్రేమించు.” సార్ చెప్పిన ఆణిముత్యాలే యివి.
“కొంగర్లు తిరుగుతూ ఏమిటా సిగ్గు, ఇప్పుడే సమర్త ఆడిన దాన్లా! జాకెట్టు పైకి లాక్కో. డాక్టరుగారు గుండె పరీక్ష చేస్తారు.”
“మగాయన కదమ్మా! సిగ్గేస్తుంది". -
“ఏమి నీలుగుతున్నావే! అంత సిగ్గయిన దానివి వెయ్యి రూపాయిలు పట్టుకుని ఏ ప్రైవేటు నర్సింగ్ హోమ్ కో వెళ్ళక పోయావా? ఊరికే మందిస్తామంటే నకరాలు పోతున్నావే!” స్టాఫ్ నర్సు అరుపులు.
కాండ్రించి ముఖం పై ఊసినట్లుగా ఒక అసహ్యకరమైన అవమానంలా ఆవేల్టి నా నైట్ డ్యూటీ మొదలైంది.
రాత్రి తొమ్మిదింటికి రొటీన్ రౌండ్స్ - చేస్తున్నాను.
“సార్! ఈ పేషెంటుకు మందులివ్వద్దన్నారు పెద్ద డాక్టరుగారు. మన చేస్తే ఎనాల్డినో, ఐరన్ టాబ్లెట్ ఇవ్వమన్నారు. అబ్జర్వేషనట. డయాగ్నోసిస్ ఇంకా కాలేదట.” డ్యూటీ నర్సు వినయంగా చెప్పింది.
అబ్జర్వేషనా వల్లకాడా. రేటు వుండదు. డబ్బు చేతిలో పడితేనే ట్రీట్మెంటు. ఈ లోపల పేషెంటు కాస్తా టపా కట్టేస్తాడు. ఈ హాస్పటల్లో, డాక్టరే ఒక నయం కాని వ్యాధి. ఇక్కడ పేషెంటు సిలువ పైన జీసస్. హౌస్ సర్జన్లు ద్రోహం చేసిన జూడాస్.
ఏం చెయ్యగలను మందులివ్వకుండానే ముందుకు కదిలాను.
మరో పేషెంటు. “ఏమిటి తల్లీ నీ బాధ!' “ఇదో స్పెషల్ కేసు సార్. గైనిక్ వార్డు కేసు. కార్డియాక్ ట్రబుల్ అని మనకు రిఫర్ చేశారు. ఇదో 'విడో' సార్! మొగుడు చచిది నాలుగేళ్ళవుతోంది. డబ్బిస్తారని ఆశతో స్టెరిలైజేషన్ క్యాంప్ కొచ్చి ట్యూబెక్టమీ చేయించు కొంది. పి.జి. స్టూడెంటు ఎవరో చేశాడట ఆపరేషను. కాంప్లికేషన్స్ డెవలప్ అయినాయట. అక్కడుంటే గొడవవుతుందని మన ముఖాన పడేశారు,”
నర్సు చెప్పింది. కళ్లనిండా సిగు. దైన్యం నింపుకొని, “బిడ్డలకు రెండు పూటలైనా కడుపునిండా తిండి పెడదామని ఈ కక్కుర్తి పని చేశానయ్యా! నాకేమన్నా అయితే బిడ్డలు అనాథలవుతారు. దయ చూపండి బాబు,” అంటూ చేతులు జోడించింది పేషెంటు. -
నీ బాధలూ, గాథలూ ఎవరికి అర్థం అవుతాయి తల్లీ! నువ్వో 'ఒళ్ళు బలిసిన లం...'గానే మా నర్సుకు కనిపిస్తావు. నువ్వో 'చిరాకు కలిగించే న్యూసెన్సు లాగే డాక్టర్లకు తోస్తావు. నీ ఆకలి, నీ అమ్మ ప్రేమ ఎవరికర్థం అవుతాయి.
రౌండ్స్ ముగిసేసరికి పదకొండు దాటింది.
“స్పెషల్ వార్డులో ఖైదీ ఒకడున్నాడు. అటెండుకండి సార్. నక్సలైట్ లీడరట. బాగా పోలీసు బందోబస్తు వుంది. జైల్లో సూసైడ్ ఎటెంప్ట్ చేశాడట. పొద్దునొచ్చింది కేసు. స్పెషల్ కేసు అని మరీ చెప్పాడు పెద్ద డాక్టరు.”
నర్సు , నేనూ స్పెషల్ వార్డువైపు కదిలాం. ఈదేశంలో కెల్లా ప్రతిభావంతులైన రచయితలు పోలీసులే. జైల్లో ఆత్మహత్య' ఈ థీమ్ పై రోజుకో రసవత్తరమైన కథానిక. కథల పోటీల్లో బహుమతులన్నీ వీళ్లకే ఇవ్వాలి.
కాలి పొడవునా బాండేజ్. ఎముకల పోగులా వున్నాడాయన. నెరిసిన తల. దీర్ఘ కాలపు ఆలోచన. అలుపుతో అర్ధనిమీలితాలైన కళ్లు. చిరునవ్వుతో 'హలో' అని పలక రించాడు. బాండేజ్ మార్చి, సి.పి. ఇంజక్షన్ ఒకటి ఇచ్చాను.
“నొప్పి ఎక్కువగా వుంటే చెప్పండి. ఎనాల్జిన్ ఇస్తాను,” అని అడిగాను.
“శరీరపు బాధలకు మనస్సు రెస్పాండ్ కావడం ఎప్పుడో మానేసింది నేస్తం! ఉద్యమ విజయాలే మాకు నిజమైన మెడికేషన్,” అంటూ నవ్వాడాయన. ఆయన నవ్వులో చిత్రమైన ఆకర్షణ వుంది.
గుడ్ నైట్ చెప్పి బయటకు వచ్చాను.
మెరుస్తున్న కళ్ళతో వీడ్కోలు చెప్పాడాయన.
రాత్రి పన్నెండు దాటింది. అలసటతో డ్యూటీ రూమ్ వైపు కదిలాను. లోపలికి అలెట్ వేసి, అక్కడ దృశ్యం చూసి షాక్ తిన్నాను. బెడ్ పై నల్లటి తుమ్మమొద్దులాంటి మగ పశువు. వాడి చుట్టూ నగ్నసర్పంలా అల్లుకుపోయిన స్త్రీ, గాడ్! ఈమె ఝాన్సీ, నర్సింగ్ స్టూడెంటు.
ఆ అమ్మాయి నన్ను చూసి సిగ్గుపడలేదు. భయపడలేదు.
"ప్లీజ్ డాక్టర్! లైటు తీసివేయండి! ఈ రాత్రికి మీరు క్యాజువాలిటీ డ్యూటీ రూమ్ లో ఆస్ తీసుకోండి,” అంటూ పక్కన సిగ్గుపడుతున్న మగ పశువుపై తన నగ్నత్వాన్ని నిస్సిగ్గుగా పుతూ చెప్పింది.
"డర్టీ బిచ్!" కోపం, బాధ, అసహ్యంతో బయటకు వచ్చాను. సెక్స్ ఒక ఎమోషనల్ ఇన్వాల్మంటు. వెగటు కలిగించే శావలాన్ వాసన, భీతావహమైన మృత్యువు చీకట్లో పాములాగ మన పక్కనుంచే వెళుతున్న భావన.
భరింపలేని నొప్పితో నిశ్శబ్దాన్ని పాడుచేసే ఒక ఆర్తనాదమో, ఒక తెరిపిలేని దగో, ఒక విరామం లేని మూలుగో, అభాగ్య మృతుని బంధువుల విలాపమో, హాస్పటల్ ఏదో మూల నుండి వినిపిస్తూనే ఉంటాయి.
ఇలాంటి వాతావరణంలో లైంగికేచ్ఛ పొందగలిగేవాళ్ళు మనుషులమని చెప్పుకోడానికి సిగ్గుపడాల్సిన వాళ్ళు.
రెండు మూడు గంటలు క్యాజువాలిటీలో అసహనంగా కోపంగా గడిపి, ముఖ్య మైన కేసుల్ని మరోసారి చూద్దామని వార్డు వైపు నడిచాను. పిడియాట్రిక్స్ వార్డు మత్తుగా జోగుతూంది.
కార్డియాలజీ వార్డు చప్పుడు చెయ్యని గుండెలా స్తబ్దుగా వుంది. మెడికల్ వార్డులో ఆస్మా
రోగి ఆయాసం మినహా ఏ శబ్దమూ లేదు. -
లేబరు వార్డు నుండి హఠాత్తుగా “ఓరి నాయనో! దేవుడో,” అంటూ అరుపులు వినిపించాయి. కంగారుగా అటు పరు గెత్తాను.
“బిడ్డ బాబు! బిడ్డ! రోజుల బిడ్డయ్యా! కుక్క ఎత్తుకుపోతోందయ్యా పట్టుకోండి! నాయనా దండం పెడతా! కదల్లేని బాలెంత నయ్యా,” ముప్పయేళ్ళ తల్లి పెద్దగా అరుస్తోంది.
వరండా మలుపు తిరుగుతూ రాజసంగా నడిచి వెళ్తున్న కుక్క కనిపించింది. పెద్దగా అరుస్తూ అటు పరిగెత్తాను. అరుపులకు బెదిరి నోట్లో వున్న బిడ్డను వదిలి 'యూ స్టుపిడ్' అన్నట్లు నా వైపు చూసి బయటకు పరిగ...
02/13/23 • 11 min
03/04/23 • 24 min
‘చిలుకంబడు దధికైవడి’ అనే కథకు మూలం, రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ, ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
ఈ కథను ప్రముఖ కథా రచయిత శ్రీ ఉణుదుర్తి సుధాకర్ గారు ఈ ఎపిసోడ్ లో సమీక్షిస్తారు.
వారికి కృతజ్ఞతలు.
ఈ కథకు మూలం ప్రముఖ తమిళ రచయిత జెయమోహన్ రాసిన ‘మత్తుఱు తయిర్’ (Mathuru thayir Jayamohan | மத்துறு தயிர் ஜெயமோகன்) అనే కథ. జెయమోహన్ గారి ‘అఱం’ అనే కథాసంకలనం లోనిది.
‘అఱం’ లోని పన్నెండు కథలు, నిజ జీవితంలోని ప్రత్యేకమైన, ప్రసిద్ధమైన వ్యక్తుల గురించి మనకు చెబుతూ రచయిత రాసిన కథలు.
ఈ కథలోని ముఖ్య పాత్ర , తిరువనంతపురం విశ్వవిద్యాలయ ఆచార్యుడుగా తమిళ సాహిత్యాన్ని బోధించిన ప్రొఫెసర్ జేసుదాసన్. కన్యాకుమారి జిల్లాలో ఒక నీరుపేద కుటుంబంలో జన్మించారు. ‘కంబ రామాయణం’ విస్తృతంగా అధ్యయనం చేసి, అందులోని కవితా సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ వేలాది విద్యార్థులను తన ఉపన్యాసాలతో అపరిమితంగా ప్రభావితం చేసి, వారిని సాహిత్యం వైపు మళ్ళించారు. తమిళ సాహితీ విమర్శకుడిగా కూడా ఎంతో పేరు గడించిన ప్రొఫెసర్ జేసుదాసన్ 2002 వ సంవత్సరంలో మరణించారు.
రామాయణంలోని సీతారాముల మధ్య వియోగాన్ని కంబ రామాయణం లోని పద్యాల ద్వారా మనకు వివరిస్తూ, వర్ణిస్తూ, తద్వారా గురు శిష్యుల మధ్య సంబంధాన్ని గొప్పగా ఆవిష్కరించిన కథ ఇది.
*ఈ కథలో ప్రస్తావించబడ్డ పద్యాలు పూతలపట్టు శ్రీరాములురెడ్డి గారు తెనిగించిన ‘కంబ రామాయణం’ లోనివి.
‘చిలుకంబడు దధికైవడి’ -
“నువ్విక్కడుండి చేసేదేవుంది? బండెక్కు!” అన్నాడు కుమార్, ప్రొఫెసర్ని సభకు తీసుక రావడానికి బయలుదేరుతూ.
“అరుణ కూడా వస్తానంది! ఆమె కోసం చూస్తున్నాను” అంటూ నసిగాను.
“బావుంది.ఎదురెళ్ళి హారతి ఇస్తావా ఏంటి? భార్య, అంటే ‘ప్రేమ’ ఉండాలి కానీ ‘ఇంత’ అవసరం లేదేమో?” అంటూ వాన్ తలుపు తెరిచాడు కుమార్.
“ఇలాంటి సమావేశాలకు వచ్చినప్పుడు, ప్రొఫెసర్ మాంఛి ఊపులో ఉంటాడు. అపుడు ఆయన మాట్లాడుతూంటే వినడం ఓ గొప్ప అనుభవం. నువ్వావకాశం కోల్పోడం నాకిష్టం లేదు. చూస్తావుగా? ” అన్నాడు బండి నడుపుతూ కుమార్.
“ వాళ్ళావిడ కూడా హల్లెలూయా అనుకుంటూ పక్కనే వుంటారేమో” అన్నా నేను.
“లేదు...లేదు. ఆవిడ స్టీఫెన్ కార్లో వస్తున్నారు. వాన్లో ఎక్కితే కళ్ళు తిరుగుతాయంది. సరే అంబాసిడర్ లో రండి, దాంట్లో అయితే ఇబ్బంది ఉండదు అని చెప్పాను. ప్రొఫెసర్ తో మాట్లాడేటప్పుడు మటుకు - సంభాషణని తెలివిగా కంబ రామాయణం మీదికి మళ్ళించే బాధ్యత నీదే! మధ్యలో పొరపాటున బైబిలని కానీ ప్రభువా! అని కానీ అన్నావో... అంతా వేరే దార్లో కెళ్ళిపోతుంది.” నింపాదిగా చెప్పుకుపోతున్నాడు కుమార్.
“ఇప్పుడు మూడేగా. సభ మొదలయ్యేది ఆరుగంటలకు కదా?” అన్నాను.
“నన్నడిగితే ఇప్పటికే ఆలస్యం అయ్యింది అంటాను. కాలాలు, వాటికి సంబంధించిన పరిమితులు.. వీటన్నిటికీ అతీతుడు ఆయన. ఇది పొద్దునా, రాత్రా, అనే స్పృహ కొంచెం కూడా ఉండదు. ఈ పాటికే ఊళ్ళో వుండే దిక్కుమాలిన సంతంతా ఆయన చుట్టూ చేరి, పోచుకోలు కబుర్లలో దింపేసుంటారు. ఈ మహాత్ముడు చిన్న పిల్లాడిలా వాళ్ళకు తన చెవులు అప్పగించి, వింటూ ఉంటాడు. వెళ్ళగానే ఆయనకు స్నానం చేయించి, లాల్చీ, పంచె తగిలించి, తీసుకవెళ్ళాల్సి ఉంటుంది.”
“స్నానం కూడా చేయించాలా?” నవ్వాను నేను.
“అలానే ఉండబోయేట్టుంది!”
కారు పున్నైవనం దగ్గర, కుడివైపుకు తిరిగింది.
”సజిన్ కి ఒక పని అంటగట్టి, నీ మీద గురి కుదరాలంటే, నువ్వీ పని పూర్తి చేయాలి! అని చెప్పి మరీ వచ్చాను.” అన్నాడు కుమార్.
“అతనికి ఈ రోజు కాలేజీ లేదా?”
“ వుంది. కానీ నాకు అసలు విషయం అకస్మాత్తుగా నిన్న రాత్రి గుర్తుకొచ్చింది. మన వల్ల అయ్యే పని కాదు! అందుకని అప్పటికప్పుడు అతనికి ఫోన్ చేసాను. పొద్దున్నే ఎనిమిదిన్నర కల్లా తయారై , మా ఇంటి దగ్గరికొచ్చేసాడు. మరీ అంత పెందరాడే వచ్చేసేటప్పటికీ, మా అక్కా వాళ్ళింటికి వేరే ఏదో చిన్న పని మీద పంపించి, అది అయింతర్వాత సభ దగ్గరికి రమ్మన్నాను. అవడానికి అరవ పంతులు అయినా, పనిమంతుడే, చూద్దాం! ఏం చేస్తాడో?”
****************
ఆయన ఇంటికి వెళ్లేసరికి మేము అనుకున్నట్టే, ప్రొఫెసర్ కేవలం పంచ మాత్రమే కట్టుకుని, నింపాదిగా వరండాలో కూచుని వున్నాడు. పాలిపోయిన తెలుపు, చిన్నపాటి ఆకారం ఆయనది. దేనికో పగలబడి నవ్వుతున్నాడు.
ఒంటిమీద చొక్కా లేకుండా, ఉన్న ఒక నల్లటి మనిషి, ఆయనకెదురుగా ఉన్న స్థంభానికి అనుకుని నిలబడి గొంతెత్తి అభినయిస్తున్నాడు, “రేయ్ ఉన్న చోటి నించీ కదలొద్దు, నీటి పాము ఉంది పక్కనే! అనంగానే, ఆ పిల్లోడు నా మాట పూర్తిగా వినకుండా వెంటనే కొబ్బరి చెట్టెక్కేసి, ‘అన్నా! అన్నా!’ అని ఆపకుండా కేకలు పెట్టాడు. రేయ్! చూస్కో, పాములు కొబ్బరి చెట్లు తేలిగ్గా ఎక్కేస్తాయి అన్నా! వాడు ‘ఏసు ప్రభువా! ఏసు ప్రభువా! అని ఆపకుండా అరిచెయ్యడం మొదలెట్టాడు.”
మేము రావడం గమనించి మాటలాపేసాడు ఆ నల్లటి మనిషి.
“కుమారూ! నువ్వేమిటి? ఇలా వచ్చావు?” అన్నాడు ప్రొఫెసర్ మమ్మల్నిద్దర్నీ చూస్తూ. “పిల్లలెలా వున్నారు? వీడు చెప్పింది విన్నావా? పాము ఈత చెట్టు ఎక్కగలదట. కల్లు కూడా తీస్తుందేమో? హ్హ హ హ్హ” నవ్వాడాయన.
“చెప్పానా! ఏవీ గుర్తు ఉండదు ఈయనకు!” నా చెవిలో గుసగుస లాడాడు కుమార్.
“ఏం సార్! బయలుదేరడానికి తయారా?” అడిగాడు కొంచెం బిగ్గరగా ఆయన్నుద్దేశించి కుమార్.
“అయ్యో! మర్చే పోయాను.” అన్నాడు హడావుడి పడుతూ ప్రొఫెసర్. “ ఈ రోజు ఆదివారం అని నాకు గుర్తే లేదు. చూడు! చర్చి కెళ్ళే రోజులు గూడా మర్చిపోయే వయసు వచ్చేసింది.”
“ఈ రోజు ఆదివారం కాదు!”అన్నా...
03/04/23 • 24 min

1 Listener
Show more

Show more
FAQ
How many episodes does Harshaneeyam have?
Harshaneeyam currently has 369 episodes available.
What topics does Harshaneeyam cover?
The podcast is about Fiction, Drama, Podcasts, Books and Arts.
What is the most popular episode on Harshaneeyam?
The episode title '‘చిలుకంబడు దధికైవడి’ - మూలం తమిళ రచయిత జెయమోహన్ రచన ‘మత్తుఱు తయిర్’' is the most popular.
What is the average episode length on Harshaneeyam?
The average episode length on Harshaneeyam is 20 minutes.
How often are episodes of Harshaneeyam released?
Episodes of Harshaneeyam are typically released every 22 hours.
When was the first episode of Harshaneeyam?
The first episode of Harshaneeyam was released on Mar 26, 2020.
Show more FAQ

Show more FAQ
Comments
5.0
out of 5
1 Rating